డోన్ నియోజక వర్గంలో జనసేన పార్టీలోకి నూతన కార్యకర్తల చేరిక

డోన్

               డోన్ ,  (జనస్వరం) :    డోన్ నియోజక వర్గం, బేతంచర్ల మండలం, బలపాల పల్లె గ్రామానికి చెందిన కొంత మంది యువకులు బాలుయాదవ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అనంతరం వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలుయాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న తమతో కలిసి ప్రయాణించడానికి బలపాలపల్లె యువకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ధ్యేయంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలన్నారు. డోన్ నియోజక వర్గంలో కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇదే విధంగా డోన్ నియోజక వర్గంలో అనేక గ్రామాల నుండి యువకులు,పెద్దలు జనసేన పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారన్నారు. గతంలో చంద్ర బాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కానీ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్ర బాబు లాగే రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కావున రాబోయే రోజుల్లో కచ్చితంగా పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మనమందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దాం అని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బేతంచెర్ల మండల క్రియాశీలక జనసైనీకులు మద్దయ్య నాయుడు, పరమేష్, నవీన్, నాగమునేంద్ర, ఆర్య, ప్యాపిలి సునీల్, జగదీష్ మరియు బలపాల పల్లె గ్రామ జనసైనీకులు శివ , మధు, చరణ్, రామాంజనేయులు, మనోహర్, వెంకటేష్, మహేష్, చిన్ను, భాస్కర్, అశోక్, ప్రకాశం, చిరంజీవి, G.మధు, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way