దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

దోమకొండ అశోక్

                   విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సూచనల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ యువ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ లో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. 7వ డివిజన్ లో గడప గడపకు పర్యటించిన వాసు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా, జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ, వారి కుటుంబ సభ్యులకు పెద్దన్నల నిలబడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి 2024లో ఒక అవకాశం ఇవ్వాలని, జనసేన పార్టీకి మీ ఆశీస్సులు కావాలని, క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు దోమకొండ మేరీ, ఉపాధ్యక్షులు పెళ్లూరి ఉమామహేశ్వరరావు, సాదిరెడ్డి శ్రీను, 6వ డివిజన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి తిలక్, 8వ డివిజన్ ఉపాధ్యక్షులు అనిల్, బండి ప్రదీప్, పెందుర్తి విజయ్ కుమార్, భాస్కర్, సాయి మోహన్, పెందుర్తి ప్రశాంతి, జనసేన పార్టీ 7వ డివిజన్ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way