Search
Close this search box.
Search
Close this search box.

రాజోలు జనసేనపార్టీ వైస్ MPP ఇంటిపల్లి ఆనందరాజు గారి ఆధ్వర్యములో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం

రాజోలు

    రాజోలు, (జనస్వరం) : రాజోలు నియోజకవర్గంలో పలు గ్రామాలలో గత తొమ్మిది రోజులు నుంచి రాజోలు మండలం పరిషత్ ఉపాధ్యక్షులు ఇంటిపల్లి ఆనందరాజు గారు ( వైస్ MPP) ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యులుగా చేరిన జనసేన కార్యకర్తలకు రోజుకు గ్రామం చొప్పున ఇంటింటికి వెళ్లి కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆఖరి రోజున చింతలపల్లి గ్రామములో క్రియాశీలక సభ్యత్వ కిట్లును జనసేన కార్యకర్తలకు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు జనసేన పార్టీలో గెలిచిన MPTCలు, వార్డ్ నెంబర్లు, సర్పంచులు, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శిల చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత నమోదు కార్డుతో పాటు, ఐదు లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క ఏడు సిద్దాంతాలతో కూడిన వివరాలు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో, అధ్యక్షుల వారి మనోగతం పేపర్, కిట్లుతో జతపరిచి ఇవ్వటం జరిగింది.ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మలికిపురం మండలం మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మేడిచర్ల వాణి జనసేన పార్టీ(MPP), అడబాల శ్రీనివాసరావు గారు( కాటన్ పాడు MPTC),  సుందర శ్రీను(గూడపల్లిMPTC), శ్రీమతి కుడుపూడి మల్లేశ్వరి(కూనవరంMPTC), శ్రీమతి పున్నం నాగదుర్గ(మెరక పాలెంMPTC), బైరానాగరాజు(అంతర్వేది దేవస్థానంMPTC), శ్రీమతి దార్ల కుమారి లక్ష్మి( రాజోలు MPTC) మరియు జిల్లా సంయుక్త కార్యదర్శులు గుబ్బల రవి కిరణ్, జనసేన నాయకులు, బోనము సాయి గారు, గడ్డం మహాలక్ష్మి ప్రసాద్, అడ్డ గళ్ళ బంగార్రాజు, సోదా మోహనరంగా,రుద్ర సూర్యనారాయణ, పిప్పళ శ్రీను, మార్ల పూడి మధు, పిప్పళ లక్ష్మణరావు, కోళ్ల సత్తిబాబు, గానసాల బాలాజీ, గానసాల రామరాజు, పలివెల రమేష్, అద్దేపల్లి గోపి, లంకపల్లి రమేష్, కోళ్ల వేణు, కోళ్ల మల్లీ, అలాగే ప్రతి గ్రామంలో జనసైనికులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధిష్టానం నాకు ఇచ్చిన క్రీయాశీలక సభ్యత్వపు బాధ్యతను సమర్ధవంతంగా పూర్తిచేయడం జరిగిందని ఇంటిపల్లి ఆనందరాజు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way