Search
Close this search box.
Search
Close this search box.

రాజంపేట పట్టణంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం

రాజంపేట

           రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్యజిల్లా, రాజంపేట పట్టణంలో కాపు సంక్షేమ యువసేన, మహిళాసేన, సభ్యులు ఆత్మీయ సమావేశం జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో భాగంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ మాధ్యమాల్లో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో ప్రతిఒక్కరు కాస్త సమయం వెచ్చించి క్షేత్ర స్థాయిలో ప్రత్యేకంగా దృష్టి సారించి సామాజిక మార్పు అభ్యున్నతి కోసం బలోపేతం దిశగా అందరినీ సోదరా, సోదరీ భావంతో కలుపుకుని ముందుకు వెళ్ళాలని కోరారు. అలానే జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వనికి మద్దతుగా ఆయన ఆశయ భావాలకు అనుగుణంగా తమ ప్రాంతాల్లో అందరూ కలిసి చైతన్యం నింపాలని కోరారు. ఇతరులతో నిరంతర ప్రక్రియగా మమేకం అవుతూ అందరి మద్దతు కూడగట్టుకొని రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాజ్యాధికారం సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, నరసింహ, రామ శ్రీనివాస్, రెడ్డిరాణి, సుభాషిణి, నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్, రాజేష్, చిరంజీవి యువత అధ్యక్షులు నాగార్జున, యువతి, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way