కె.తాడిపుట్టు గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

కె.తాడిపుట్టు

     అరకు ( జనస్వరం ) : హుకుంపేట మండలం రాఫా పంచాయతీ కె.తాడిపుట్టు గ్రామంలో జనసేనపార్టీ క్రియా శీలక సభ్యత్వం కిట్లు పంపిణీలో భాగంగా జనసైనికులతో అరకు నియోజకవర్గ నాయకులు బలిజ కోటేశ్వరరావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేము చేసిన క్రియా శీలక సభ్యత్వం మండల జనసైనికులకు గొప్ప భద్రతనిస్తుందని ఏ పార్టీలో లేనటువటువంటి భీమా సౌకర్యం తన అభిమానులకు జనసైనికులకు కలిపించాలని జనసేనాని తలిచిన గొప్ప ఆలోచన ఇదని అన్నారు. అలాగే ఎన్నో సేవకార్యక్రమలు చేస్తూ అధికారంలో లేకున్నా కూడా 30 కోట్ల రూపాయలతో కౌలు రైతులకు ఆదుకున్న మహావ్యక్తియని అటువంటి నిజాయితీ గలా నాయుడిపై పదవులున్నదనే అహంతో ఆరోపణలు చేస్తున్న మార్పు కొరకు సర్వశక్తులతో వచ్చే ఎన్నికలకు సిద్ధపడుతున్నారని అన్నారు. నాకు తెలిసి గిరిజన బ్రతుకులు మారాలంటే జనసేనపార్టీ మాత్రమే సాధ్యమని బలంగా విశ్వసిస్తున్నామని అందుకే జనసేన పార్టీ ద్వారా సిద్ధాంతాలకు కట్టుబడి మార్పు కోసం మా వంతు శక్తి వంచన లేకుండా గ్రామస్థాయి పర్యటన చేస్తున్నామని అందులో భాగంగా ఈ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద నాగరాజు, పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు జన్ని కొండబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు జన్ని లింగన్న, జన్ని సతీష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way