శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

     శృంగవరపుకోట, (జనస్వరం) : శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకుడు వబ్బిన సత్యనారాయణ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కి శృంగవరపుకోట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉందని వుందని తెలిపారు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి టికెట్ ఇచ్చిన కారణంగా ఈ సారి జనసేనపార్టీ అభ్యర్దినే పోటీలో నిలిపేందుకు సుముఖంగా ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం, బూత్ స్దాయిలో జనసేనపార్టీ సానుభూతి పరులను గుర్తించి వారి ద్వారా పార్టీని బలోపేతం చేయాలని అగ్రనాయకత్వం నుంచి సంకేతాలు వచ్చాయని త్వరలో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way