నెల్లూరులో జనసేన కార్యకర్తల ఆత్మీయ కలయిక

నెల్లూరు

       నెల్లూరు ( జనస్వరం ) : మేం విన్నాం మేమున్నాం జనసేన నెల్లూరు కార్యక్రమాన్ని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ 33 వ డివిజన్ నుండి కార్యకర్త చిన్న రాజా ఇంటి వద్ద నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ కి పనిచేస్తున్న కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల మద్దతు తో వారి ఇరువు పొరుగు వారిని కూడా ప్రభావితం చేసే విధంగా జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, స్థానిక సమస్యలపై పార్టీ తరపున నిలబడేందుకు సిద్ధం కావాలని భరోసా ఇస్తూ తమ కుటుంబ సభ్యులు ఓట్లు వేయడమే కాక చుట్టుపక్కల వారిని బందు మిత్రులను కలసి జనసేన పార్టీ కి మద్దతు కోరే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కులమతాలకతీతంగా అందరికీ సమాన హోదా కల్పించే విధంగా మన బిడ్దల భవిత కోసం పోరాడేందుకు వచ్చిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కి ఈ సారి అవకాశం ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత మనకందరికీ ఉందని తెలిపారు.స్థానిక సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఏ ఇబ్బందులు ఎదురైనా అండగా జిల్లా కమిటీ సభ్యులు తోడుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు 33 వ డివిజన్ జనసేన నాయకుడు చిన్న రాజా, 42వ డివిజన్ నాయకుడు కంతర్ భాయ్, ప్రసన్న, అమీన్, ప్రశాంత్ గౌడ్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way