Search
Close this search box.
Search
Close this search box.

అనకాపల్లిలో వైసీపీ కి ఎదురుదెబ్బ : జనసేన పార్టీలోకి చేరికలు

అనకాపల్లి

       అనకాపల్లి ( జనస్వరం ) : అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలంలో మేజర్ పంచాయతీ అయిన తుమ్మపాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పల్లెల గణేష్ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి తన 70 మంది అనుచరులతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారి సమక్షంలో జనసేన పార్టీ లోకి చేరారు. తుమ్మపాలలో జరిగిన సభలో భాస్కరరావు గారు వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల్లో మార్పు కేవలం పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అని అన్నారు. రాష్ట్రంలో తన సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే అని పేర్కొన్నారు. పార్టీ మీద నమ్మకంతో పల్లెల గణేష్ గారు లాగా ఇంకా ఎంతో మంది నాయకులు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. జనసైనికుల సమిష్టి కృషితో అనకాపల్లిలో మరియు రాష్ట్రంలో జనసేన జెండా తప్పకుండా ఎగురుతుంది అని తెలిపారు. అనంతరం పల్లెల గణేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు తమను ఎంతో ఆకర్షించాయని అన్నారు. అనకాపల్లి లో జనసేన పార్టీ ని గెలిపించి భాస్కరరావు గారిని అసెంబ్లీ కి పంపించేందుకు తాము అందరం కృషి చేస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు మంగా ఈశ్వర్, గెంజి సత్యారావు,శ్రీరాందాస్ గోవింద్,మాట్రూ దామోదర్, రాయి జనార్దన్, నగిరెడ్డి పవన్, కోన దుర్గ, నాగేశ్వరావు, బంటు రవి, కొసిరెడ్డి త్రినాధ్, సేనాపతి రవి, పోతిన సాధుబాబు, కోనేటి లోవరాజు, కొమురు ప్రసాద్, కరణం రాము, బొబ్బది రమణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way