Search
Close this search box.
Search
Close this search box.

జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చూడాలని వినతి

     రాజంపేట ( జనస్వరం ) : జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ కడప నుండి రాజంపేట, కోడూరు మీదుగా తిరుపతి వెళ్లే ప్రధాన జాతీయ రహదారిపై రద్దీగా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో మలుపులు మరియు కొన్ని ప్రమాదకారమైన ప్రదేశాలను ప్రత్యేకంగా గుర్తించి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు రహదారిపై రక్షణగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వాహనాలు ప్రమాదానికి గురై ప్రాణ నష్టం జరుగుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రావడం లేదు. అందుకే ఇవాళ రాజంపేటలోని ఎజ్గిక్యూటివ్ ఇంజనీర్ కి, అలాగే కడప జాతీయ రహదారి డివిజన్ అధికారికి జాతీయ రహదారి మార్గంలో ప్రమాద మలుపుల్ని గుర్తించి ప్రమాద సూచికలు ఏర్పాటుచేసి ప్రాణాలు కోల్పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరడమైనది. అలాగే రోడ్డు మరమ్మత్తులపైన ద్రుష్టి పెట్టాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామశ్రీనివాస్, వెంకటయ్య, యువ నాయకులు నంద్యాల హరి,మన్నేరు సూరిబాబు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు వాణి శంకర్, టీడీపీ నాయకులు అబుబకర్, కరీమ్, బాలాజీ, మైనార్టీ నాయకులు మహబూబ్ భాష, రామంజులు, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way