ఎచ్చర్ల నియోజకవర్గంలో క్రాంతిశ్రీ గారి సమక్షంలో 4 మండలాల జనసైనికుల, వీరమహిళలతో సమావేశం ఏర్పాటు

ఎచ్చర్ల నియోజకవర్గంలో క్రాంతిశ్రీ గారి సమక్షంలో 4 మండలాల జనసైనికుల, వీరమహిళలతో సమావేశం ఏర్పాటు

              ఎచ్చర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి క్రాంతిశ్రీ గారి సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనల్ని పాటిస్తూ 4 మండలాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్2 వ తేదీన జనసేనాని జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు వేడుకలగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ తమ సూచనలు, సలహాలు, సమస్యలు తెలియజేసారు. పార్టీ పెద్దలు సూచన మేరకు మొదటి రోజు ప్రధానంగా కరోనా బాధితులకు వెంటిలేటర్స్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా చిరంజీవి యువతి అధ్యక్షులు Dr విశ్వక్ గారు తెలియజేసారు. 2 వరోజు పోలీసు, సచివాలయం, మండల,  నియోజకవర్గం హాస్పిటల్స్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేయడం, 3వ రోజు బీద ప్రజలు భోజన ఏర్పాట్లు, 4 వరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని, 5వరోజు రక్తదాన శిబిరం, 6వరోజు హోమియో జనరిక్ పంపిణీ, 7వ రోజు కరోనా వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో లావేరు, ఎచ్చర్ల, రణస్థలం, జి.సిగడం మండలం జనసైనికులు, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way