Search
Close this search box.
Search
Close this search box.

రాష్ట్ర పర్యాటక శాఖలో ఆస్తులు ప్రైవేటు పరం పేరిట భారీ స్కాం

వెయ్యి కోట్లకు పైగా విలువైన పర్యాటక శాఖ హోటళ్లు, రిసార్ట్ లను మూడు రోజుల షార్ట్ టెండర్ తో ప్రైవేట్ కి కట్టపెట్టే యత్నం.

రూ. 100 కోట్లకు పైగా ఆదాయం, లాభాలు వస్తున్న ఆస్తులను కేవలం 20 కోట్ల కు అప్పగించే కుట్ర.

గిరిజన ప్రాంతాల్లోని టూరిజం ఆస్తులు 1/70 నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పరం.

నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలవడనుండగా ఈ హడావుడి.

సి ఆర్ జెడ్ నిబంధనలకు విరుద్ధంగా బీచ్ ఆస్తులు ధారా దత్తం

మంత్రి రోజా పర్యవేక్షణలో భారీ స్కాం.

పూర్తికాని రుషికొండ 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఆదాయం పేరట 20 కోట్ల కోసం వెయ్యి కోట్ల ఆస్తులు అప్పగించే ప్రయత్నం

జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్

విశాఖపట్నం,జనవరి 24:-

     రాష్ట్రం ఎన్నికలకు సమాయత్తం అవుతున్న దశలో రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని పర్యాటక స్థలాలు అన్నింటిని ప్రైవేట్ పరం చేసే భారీ కుంభకోణానికి తెరలేపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ఒత్తిడితో వైయస్సార్ కాంగ్రెస్ పెద్దలకు బంగారు బాతు గుడ్డు లాంటి వెయ్యి కోట్ల రూపాయల విలువైన హోటళ్లు , రిసార్ట్ లు, బీచ్ ఫ్రంట్ లను కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నం ప్రారంభమైంది. ఎన్నో దశాబ్దాలుగా పర్యాటక శాఖకు ఏటా వందల కోట్ల ఆదాయం ఇస్తూ వస్తున్న ఈ ఆస్తులను 20 కోట్ల కు కేవలం మూడు రోజుల వ్యవధిలో తమ వారికి కట్టపట్టేందుకు పర్యాటకశాఖ తో షార్ట్ టెండర్ నోటీస్ ఇప్పించారు. కేవలం మూడు రోజుల్లో ఈ పర్యాటక ఆస్తులను అంచనా వేసి దక్కించుకోవడం కొత్త వారి వల్ల సాధ్యం కాదు.ముందుగా నిర్ణయించిన వ్యక్తులకు మంత్రి ఇష్ట ప్రకారం కట్టపెట్టేందుకు పర్యాటకశాఖ ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం గిరిజన చట్టాలను, కోస్తా నియంత్రణ మండలి చట్టాలను ఉల్లంఘించి మరీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

రాష్ట్ర పర్యాటక శాఖకు బంగారు బాతు గుడ్డు లాంటి విశాఖపట్నం యాత్రినివాస్, విశాఖ మన్యం లోని తైడా జంగిల్ ఫారెస్ట్, బుర్ర గుహలకు సమీపంలోని అనంతగిరి రిసార్ట్స్, ఆంధ్ర ఊటీగా పేరుమీద అరకు వ్యాలీ రిసార్ట్ , మయూరి రిసార్ట్స్, లంబసింగిలో కొత్తగా కట్టిన రిసార్ట్స్, విజయవాడలో అత్యంత ఆకర్షణీయమైన మయూరి రిసార్ట్స్, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి రిసార్ట్, కర్నూలు, నెల్లూరు, కడప అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని పర్యాటకశాఖ ఆస్తులు అన్నింటిని కేవలం సంవత్సరానికి 20 కోట్ల రూపాయల ఆదాయం కోసం పర్యాటకశాఖ షార్ట్ టెండర్ పిలిచింది. విచిత్రంగా వీటిపై ఇప్పటికే 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం, 50 కోట్ల లాభం వస్తుంది. 1100 మందికి పైగా ఉద్యోగులు వీటి ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వీరి పొట్ట కొట్టి ఈ ఆస్తులను వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దల పరం చేసేందుకు మంత్రి రోజా ప్రయత్నించడం, అధికారులు నిబంధనలకు విరుద్ధం, పర్యాటక శాఖ కు నష్టం అని తెలిసినా ముందు కు వెళ్ళడం నిజంగా దురదృష్టకరం.

నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడుతున్న సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోకూడదు అనేది ఎన్నికల నిబంధనావళి.ఈ ఆస్తులపై ప్రభుత్వం 180 కోట్ల రూపాయల రుణాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తీసుకొచ్చింది. ఇన్ని చేసిన తర్వాత అకస్మాత్తుగా వీటిని ప్రైవేటుపరం చేయటమంటే కచ్చితంగా వీటిని కొల్లగొట్టేయటమే. ఒక ఋషికొండ కోసమే 550 కోట్ల రూపాయలకు నీళ్ల ప్రాయం గా ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరానికి కేవలం 20 కోట్ల ఆదాయం పేరిట ప్రైవేటు వ్యక్తులకు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తులను అపపగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రిటైర్డ్ ఐ పీ ఎస్ అధికారి సి. ఆంజనేయ రెడ్డి లాంటి నిజాయితీపరులైన అధికారులు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను దేశంలోనే అత్యున్నతమైనదిగా తీర్చిదిద్దగా, రోజా వంటి అవినీతిపరులైన మంత్రులు దానిని పూర్తిగా లంచాల కోసం అమ్మివేస్తున్నారు. ఆర్థిక అక్రమాలు చిరునామా అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిని ప్రోత్సహిస్తున్నారు . ఈ చర్యల ద్వారా గిరిజన చట్టాలను నిబంధనలో ఉల్లంఘిస్తున్నారు.

*గిరిజన ప్రాంతాల్లో పర్యాటక ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం 1/ 70 నిబంధనలకు విరుద్ధం*

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖకు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ ఆస్తులున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ హోటళ్లు , రిసార్ట్ లు నిర్మించకూడదని నిబంధన ఉన్నందున ప్రభుత్వ సంస్థ పేరుతో రాష్ట్ర పర్యాటక శాఖ హోటల్లను నిర్మించింది. ఇప్పుడు వీటిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయటం 1/70 చట్టానికి విరుద్ధం.“నా ఎస్సీలు నా ఎస్టిలు”అని పదే పదే గొంతు చించుకొనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు ఇది విరుద్ధం. పర్యాటక శాఖకు గిరిజన ప్రాంతాల్లో ఆస్తులను నిర్వహించే సామర్థ్యం లేకపోతే గిరిజన సంస్థలకు, సంఘాలకు లేదా ట్రై కార్ కు వీటిని అప్పగించాలి. అందుకు విరుద్ధంగా ప్రైవేట్ పెత్తందారులకు కట్టబెడితే రాష్ట్ర పర్యాటక శాఖ గిరిజన చట్టాలు ఉల్లంఘించినట్లే అవుతుంది.

– సముద్ర తీర ఆస్తుల ప్రైవేటీకరణ సి ఆర్ జెడ్ నిబంధనలకు విరుద్ధం

గిరిజన ప్రాంతాల తర్వాత పర్యాటక శాఖకు సముద్ర తీరంలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వ సంస్థ పేరిట పర్యాటకశాఖ కోస్తా నియంత్రణ మండలి నోటిఫికేషన్ పరిధిలో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు పొందింది. అనుమతులకు విరుద్ధంగా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల పరం చేయటం చెల్లదు. గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు సి ఆర్ జెడ్ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులను గతంలో తొలగించారు. ఈ వాస్తవాలను గ్రహించకుండా వీటిని ప్రైవేట్ పరం చేసేందుకు అధికారులు టెండర్ల పిలవడం విరుద్ధం.

నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడతుండగా మూడు రోజుల షార్ట్ టెండర్ పేరిట 1000 కోట్ల ఆస్తులు కట్టబెట్టటమా?

నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలవడనుండగా దశాబ్దాలుగా రాష్ట్ర పర్యాటక శాఖ చేతిలో ఉన్న 1000 కోట్లకు పైగా ఆస్తులను మూడు రోజుల వ్యవధిలో షార్ట్ టెండర్ నోటిస్ పేరిట ప్రైవేటు పరం చేయనుండడం పలు అనుమానాలకు ఆస్కారం ఇస్తుంది. ముందుగానే ఎంపిక చేసుకున్న కొందరికి పర్యాటకశాఖ ఆస్తులను ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ఒత్తిడితో ఈ నోటీసు వెలుబడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా ప్రభుత్వానికి పర్యాటకశాఖ ఆస్తులను ప్రైవేటుపరం చేసే ఉద్దేశం ఉంటే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఎందుకు మౌనంగా వున్నారో అధికారులే చెప్పాలి. ఎన్నికల ముందు హడావుడి నిర్ణయాలను గతంలో కోర్టులు తప్పుపట్టాయి . ఈ వాస్తవాన్ని గ్రహించి ఈ షార్ట్ టెండర్ ను రద్దుచేసి ప్రభుత్వ పరంగానే పర్యాటకశాఖ ఆస్తులను కొనసాగించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నాం.

1100 మంది ఉద్యోగులను ఏం చేస్తారు?

రాష్ట్ర ప్రభుత్వ అహంకారపూరిత పెత్తందారీ నిర్ణయాల కారణంగా ఇప్పటికే వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తాజాగా పర్యాటక శాఖ నిర్ణయం కారణంగా ఎన్నో దశాబ్దాలుగా పర్యాటకశాఖ హోటల్లో, రిసార్ట్స్ లో పనిచేస్తున్న 1100 మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ఈ ఉద్యోగులను ప్రభుత్వం తన ప్రైవేటీకరణ ప్రయత్నాలతో తొలగించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో బుర్ర వున్న ఏ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోదు. పర్యాటకశాఖ ఆస్తుల ప్రైవేటుపరం వ్యవహారం ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందా? లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు సిద్ధంగా వున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని రాష్ట్ర పర్యాటక ఆస్తులు ప్రైవేటుపరం చేసే టెండర్ ను ఉపసంహరించి ఉద్యోగులను ప్రభుత్వ పరంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమం లో చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త పి వి స్ న్ రాజు, రూప పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way