నిరుపేద కుటుంబానికి డాక్టర్ కందుల చేయూత

     విశాఖపట్నం ( జనస్వరం ) : నిరుపేద కుటుంబానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు. బీచ్ లో జరిగిన ప్రమాదంలో కాళ్లు చచ్చు బడిపోయి నడవలేని స్థితిలో ఉన్న యువకునికి వీల్ చైర్ ను అందజేశారు. పవనన్న ప్రజా బాట 80 వ రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 41 వ వార్డు జ్ఞానాపురంలో ఆ యువకుని ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. వీల్ చైర్ ను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఊహించని విధంగా ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న యువకుడికి తను అండగా ఉంటానని తెలిపారు. ఈ మేరకు ఆ యువకుడికి వీల్ చైర్ ను అందించడం కూడా జరిగిందన్నారు. తనకు ప్రజలకు మంచి చేయడమే తెలుసు అని చెప్పారు. ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటానని పేర్కొన్నారు. గత 80 రోజుల నుంచి నియోజకవర్గంలో పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమం నిర్విరామంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని సుమారుగా అన్ని వార్డులలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మంచి చేసేందుకు తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు జనసేన నాయకులు అంతోని, చెరుకూరు గణేష్, అప్పారావు, మణి, ప్రసాద్, సంతోష్, జానకి, మంగ, లలిత, ఝాన్సీ, కుమారి, దుర్గ, దక్షిణ నియోజకవర్గం జనసేన యువ నాయకులు కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way