
విజయవాడ, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ విజయవాడ నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర గల బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నెరుసు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ చట్టాలు బలంగా లేకపోతే ఇలాంటివి పునరావృతం అవుతాయని, గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తప్పు చేస్తే ఎంతటివారినైనా శిక్షించే బలమైన చట్టాలు రావాలని మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల కట్టడి, మద్యంపై నియంత్రణ ప్రభుత్వం తీసుకోగపోగా మద్యంను ప్రభుత్వము అమ్మటం, మద్యం పట్ల నియంత్రణ లేకపోవడం మహిళలపై దాడులు పెరిగిపోవడానికి కారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.