పవన్ కళ్యాణ్ జన్మదిన మాసోత్సవాల సందర్బంగా జనసేన కువైట్ సేవా సమితి ఆధ్వర్యంలో 3వరోజు కార్యక్రమం

        రైల్వే కోడూరు,  (జనస్వరం) :  జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి మాస దిన పుట్టినరోజు వేడుకల సందర్బంగా  మూడవ రోజు జనసేన పార్టీ కువైట్ జనసైనికుడు ఆలీ షేక్, కుంచా శంకర్ సహకారంతో కడపజిల్లా రైల్వే కోడూరులోని జనసేన కార్యకర్త షేక్ నజీరుద్దీన్ సతీమణి రషీద్ గారు రోడ్డు ప్రమాదానికి గురైన సందర్బంగా వారి వైధ్యం ఖర్చులకు జనసేన వీరమహిళలు మరియు జనసేన మహిళా సర్పంచ్ చేతుల మీదుగా 7000 వేల రూపాయలు ఆర్థీక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు రాష్ట్ర కార్యదర్శి ముఖరంచాన్ మరియు తాతంశెట్టి నాగేంద్ర గారు ప్రత్యేక ఆహ్వానితులుగ రాగా ఈ కార్యక్రమమును ముందుండి జనసేన నాయకులు రెడ్డి ప్రసాద్ నడిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన వీరమహిళలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ కువైట్ టీం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయచున్నాము.