జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాదములో గాయపడ్డ వారిని పరామర్శించిన చింతలపూడి జనసేనపార్టీ ఇంఛార్జ్ మేకా ఈశ్వరయ్య

    జంగారెడ్డిగూడెం, (జనస్వరం) : జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామ పంచాయతీ జల్లేరు బీసీ కాలనీ దగ్గరలో ఉన్న జల్లేరు వాగులో బ్రిడ్జి పై నుండి భద్రాచలం నుండి జంగారెడ్డిగూడెం వస్తున్న పల్లెవెలుగు ఆర్ టి సి బస్సు ప్రయాణికులతో పడిపోయినది. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు డ్రైవర్ తో సహా 9 మంది మరణించినారు. మిగిలిన ప్రయాణికులకు బలమైన దెబ్బలు తగిలి ప్రాణాలతో బయటపడినారు. వివిధ హాస్పిటల్ లలో వైద్యం పొందుతున్న వారిని జనసేన పార్టీ తరుపున చింతలపూడి నియోజకవర్గం ఇంఛార్జ్ మేకా ఈశ్వరయ్య, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కౌన్సిలర్ వలవల తాతాజీ, పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, శివానందస్వామి, గుబ్బల ప్రసాద్, నులకాని చందు ఇతర జనసేన పార్టీ నాయకులు పరామర్శించి, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని  ప్రభుత్వాన్ని జనసేన పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరణించిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం, గాయపడిన వారికి నష్ట పరిహారం ఇచ్చి, మెరుగైన వైద్యం అందించాలని జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way