సీపీఎస్ విధానం వెంటనే రద్దు చేయాలి : అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి

    అనంతపురం, (జనస్వరం) : APCPSUS అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో వజ్ర సంకల్ప దీక్షకు అనంతపురం జనసేన పార్టీ తరపున మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు కు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్లు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి గారు ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే సీపీఎస్ విధానం వెంటనే రద్దు చేయాలని, రెండున్నర సంవత్సరాలుగా పెండింగులో ఉన్న 8 డీఏ లను విడుదల చేయాలని,ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు కు ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి హితవు పలికారు. హామీలు అమలు చెయ్యకపోతే ఆందోళన, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, ప్రధాన కార్యదర్శులు పార్టీ చంద్రశేఖర్ కుమ్మర నాగేంద్ర, జనసేన నాయకులు విశ్వనాధ్ జనసేన, సంతోష్ దేవన, ధరాజ్ భాష, ఆకుల అశోక్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way