నిడమర్రు మండలం జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

    ఉంగుటూరు, (జనస్వరం) : ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం నిడమర్రు గ్రామంలో జనసేన నాయకులు మైలవరపు సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో గణపవరం మీనాక్షి ఐ ఆసుపత్రి వారి సహకారంతో డాక్టర్ హరినాథ్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి కంటి పరీక్షలు చేసి కళ్ల జోళ్లు అందించారు. అదే విధంగా కళ్ల శస్త్ర చికిత్సలు అవసరమైన సుమారు 50 మందికి ఆపరేషన్లు రాజమండ్రి గౌతమి నేత్రాలయలో చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ హరినాథ్ రెడ్డికి జనసేన నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు జన సేన నాయకులు వంగా రఘు, తోట పవన్, తానేటి నాగేశ్వర రావు, చిన్నం ఆనంద్, దుసనపూడి శ్రీను, దుసనపుడి ఉమా సురేష్, గౌతు వెంకన్న, తాతాజీ, నందా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way