గంగాధర నెల్లూరు, (జనస్వరం) : చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలు అయినటువంటి కార్వేటినగరం మండలం, పద్మ సరస్సు, B. C కాలనీ, మరియు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి ముంపు ప్రాంతాలైన, వరద బాధితుల కుటుంబాలకు పశ్చిమగోదావరి జిల్లా జనసేనపార్టీ నాయకులు సహకారంతో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. అలానే నష్టపోయిన రైతులను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకొని అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెల్లుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు, ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పడగాల మురళి, జిల్లా సంయుక్త కార్యదర్శులు భాను భాను ప్రకాష్, మెదవాడ రాఘవ మరియు కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, ఉపాధ్యక్షులు విజయ్, అన్నామలై, నరేష్, సూరి, హరీష్, భాను చంద్ర రెడ్డి, విజయ వర్మ మరియు పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది.
