నాణ్యమైన భోజనం అందించట్లేదని వార్డెన్ ను ప్రశ్నించిన ఉరవకొండ జనసేన నాయకులు

   ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఉరవకొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వసతి గృహలను తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులు చెప్పినట్టుగానే భోజనంలో పురుగులు ఉన్నాయి. ఇలా కనీసం వారంలో మూడు నాలుగు రోజులపాటు భోజనంలో వస్తున్నాయని, వీటిని ఎలా తినాలి అని విద్యార్థులు వాపోయారు. దీనిపై జనసేన పార్టీ నాయకులు వసతి గృహ నిర్వాహకులపై మండిపడుతూ నాణ్యమైన భోజనం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇటువంటి తప్పు మరొకసారి పునరావృతం కాకూడదని, ఒకవేళ అలా జరిగిన పక్షంలో ఉన్నతాధికారులకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి మీ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంద్రశేఖర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way