నాణ్యమైన భోజనం అందించట్లేదని వార్డెన్ ను ప్రశ్నించిన ఉరవకొండ జనసేన నాయకులు

   ఉరవకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఉరవకొండ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వసతి గృహలను తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులు చెప్పినట్టుగానే భోజనంలో పురుగులు ఉన్నాయి. ఇలా కనీసం వారంలో మూడు నాలుగు రోజులపాటు భోజనంలో వస్తున్నాయని, వీటిని ఎలా తినాలి అని విద్యార్థులు వాపోయారు. దీనిపై జనసేన పార్టీ నాయకులు వసతి గృహ నిర్వాహకులపై మండిపడుతూ నాణ్యమైన భోజనం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇటువంటి తప్పు మరొకసారి పునరావృతం కాకూడదని, ఒకవేళ అలా జరిగిన పక్షంలో ఉన్నతాధికారులకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి మీ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చంద్రశేఖర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు వెంటనే పరిహారం అందించాలి : అనంతపురం జిల్లా జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి