” జనం కోసమే జనసేన ” అనే కార్యక్రమములో భాగంగా గ్రామాల్లో పర్యటించిన అరకు జనసేన నాయకులు

అరకు

   అరకు, (జనస్వరం) :  ” జనం కోసమే జనసేన” అనే కార్యక్రమములో భాగంగా  జనసేన సాయి బాబా, దూరియ సన్యాసిరావు, గెమ్మెలి, కొండప్ప ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం, సీసా ముండ గ్రామంలో పర్యటించడం జరిగింది. తరువాత గిరిజనులతో సమావేశమై, ఆయా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పట్ల చర్చించారు. ఈ సందర్భంగా సాయిబాబా, దురియా సన్యాసిరావు, గెమ్మెలి, కొండప్ప తదితరులు మాట్లాడుతూ గ్రామంలో మంచినీరు వారం రోజుల నుండి అందకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ప్రభుత్వ సంబంధిత అధికారులుకు తెలియదా? అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గ్రామాల్లో ఉన్న సోలార్ మరమ్మతు అవడంవల్ల గిరిజనులకు మంచినీరు అందని ద్రాక్ష వల్లే ఉందని, తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని గ్రామాల్లోకి  వెళ్లి సోలార్ మరమ్మతులు చేపట్టి ,గిరిజనులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరుపున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పట్టా పేరుతో డబ్బులు వసూలు చేసే విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రజల తరఫున ప్రభుత్వానికి సూచించారు. అనంతరం టిడిపి, వైసిపి కార్యకర్తలకు కండువాలు వేసి  జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో కొర్ర జగన్నాథ్ రావు, జర్నీ అప్పలస్వామి కొర్ర, సింహాద్రి కోనేపు, రమేష్, కుర్ర భీమన్న, జర్నీ సోమన్న తదితరులు చేరడం జరిగింది. అనంతరం జనసేన బృందం ఆధ్వర్యంలో మరమ్మతులో ఉన్న సోలార్ ని పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way