మహాకవి గురజాడ చిత్రపటానికి నివాళులు అర్పించిన విజయనగరం జనసేన నాయకులు

గురజాడ

        విజయనగరం ( జనస్వరం ) : మహాకవి గురజాడ అప్పారావు 106వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్విని, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళ, రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి శ్రీమతి కాటం అశ్విని మాట్లాడుతూ నవయుగ వైతాళికుడు, కాలాన్ని జయంచిన మహానుభావుడు మహాకవి గురజాడ అప్పారావు అని అభివర్ణించారు. ఆయన రచనలు పుత్తడిబొమ్మ, కన్యాశుల్కం మొదలైనవి యావత్తు ప్రపంచ మానవజాతికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి కాదని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, గేదెల సాయి కుమార్, గంధవరపు రఘు, కందివలస భాష, బూర వాసు, రాగోలు సాయి కిరణ్, కిలారి వినయ్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way