రోడ్డు పక్కన శరణార్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి

శరణార్ధుల

   కాకినాడ, (జనస్వరం) : శీతాకాలంలో రోడ్డు పక్కన శరణార్ధుల కోసం నిన్న రాత్రి కాకినాడలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేసిన జనసైనికులు.ఈ కార్యక్రమానికి జనసేన వీరమహిళ, జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి శ్రీనివాస్ గారి చేతులమీదగా ప్రారంభించి శరణార్ధులకు దుప్పట్లు అందివ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ జనసేన కుటుంబంలో నా ఆత్మీయ సోదరులు మంచితనం, మానవత్వంతో ఎప్పుడు సమాజ శ్రేయస్సుకోసం ఆలోచించే యువనాయకులు బుచ్చిరాజు మల్లిరెడ్డి, కర్రీ చక్రధర్, వల్లభ శెట్టి వెంకటేష్, గంగాధర్, వీరబాబు గార్లు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి వారి మానవత్వ విలువలు చాటుకున్నారు. సొంత తోబుట్టువులా నన్ను ఎప్పుడు ఆదరిస్తూ, గౌరవించి, ఎప్పుడు నీ వెంట మేమున్నామంటూ ప్రోత్సహించే సోదర జనసైనికులకు శ్రీ మతి సుంకర కృష్ణవేణి గారు ఈ సందర్భంగా  ధన్యవాదములు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way