లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర

లచ్చయ్యపేట

    విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని సీతానగరం నుండి లచ్చయ్యపేట వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు మరియు వివిధ మండలాల మరియు నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. సీతానగరం మండలంలో గల వివిధ గ్రామాల రైతులు పొలంలో ఉన్న మట్టిని ముడుపులుగా కట్టి లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముడుపుగా చెల్లించారు. ఆలయంలో రైతులు మరియు జనసేన నాయకులు చెరుకు బకాయిలు చెల్లించాలని, అలాగే ఫ్యాక్టరీ నడిపే విధంగా చూడాలని స్వామి వారిని వేడుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కాసేపు స్వామివారికి భజన కార్యక్రమం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఆవరణంలో చెరుకు మొక్కలు నాటి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం జనసేన నాయకులు మరియు పార్వతీపురం నియోజకవర్గం, బొబ్బిలి, కురుపాం నియోజకవర్గాల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way