శృంగవరపుకోట నియోజకవర్గములో జనసేన పార్టీలోకి భారీ చేరికలు

    కొత్తవలస, (జనస్వరం) : విజయనగరం, శృంగవరపుకోట నియోజకవర్గం, కొత్తవలసలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు శ్రీ టి. శివ శంకర్ గారు, శ్రీమతి పాలవలస యశస్వి గారి సమక్షంలో పెదిరెడ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో  YSRCP పార్టీ నుండి వందమంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా శివశంకర్ గారు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో వారసత్వ రాజకీయాలతోను, బానిసత్వ రాజకీయాలతోను ప్రజలు బందీలుగా ఉన్నారు. వీటిని ప్రక్షాళన చేసేందుకే జనసేన పార్టీ ఆవిర్భివించిందని పేర్కొన్నారు. అలాగే యశస్వి గారు మాట్లాడుతూ  ప్రజాసమస్యలపై జనసేన చేసే పోరాటాల దెబ్బకు వైస్సార్సీపీ దిగొస్తుంది. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో S కోట జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీ వబ్బిన సత్తిబాబు గారు, శ్రీ గొరపల్లి రవికుమార్ గారు, శ్రీ గొరపల్లి చినబాబు గారు, శ్రీ వబ్బిన సన్యాసినాయుడు గారు, జిల్లా నాయకులు ఆదాడ మోహన్ రావు, త్యాడ రామకృష్ణారావు (బాలు), పార్లమెంటరీ కమిటీ సభ్యులు మల్లువలస శ్రీను, నాయకులు నక్కరాజు సతీష్, వబ్బిన సతీష్, తూరిబిల్లి విజయ్ కుమార్, గురజాడ వెంకటేష్, గాలి అప్పారావు, బోని రామ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way