సోమశిల జలాశయం వద్ద జనసేన నాయకుల ఆందోళన

సోమశిల జలాశయం

      అనంతసాగరం, (జనస్వరం) : సోమశిల జలాశయంలో దిగువప్రాంతంలో చేపలు మృత్యువాత పడిన విషయంపై జనసేన నాయకులు లక్ష్మికుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సోమశిల జనసేన నాయకులు లక్ష్మి కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ గతంలో కూడా చేపలు మృత్యువాత పడ్డాయని, అందుకు కారణం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అని ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సమయంలో జాలర్లు చేపల వేట సాగిస్తూ ఉన్నట్లుయితే మరి జాలర్లు పరిస్థితి ఏమిటని వాపోయారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇది రెండవసారి ఐనా జలాశయం అధికారులు, మత్స్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఇకనైనా అధికారులు స్పందించి చేపలు మృతి చెందడానికి గల కారణాలు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు చేపల మృత్యువాతపై చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరం మండల జనసేన పార్టీ అధికార ప్రతినిధి రవి, జనసేన నాయకులు శివ, పవన్‌, జననాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way