మహా పాదయాత్రకు శ్రీ పవన్‌ కళ్యాణ్ గారి మద్దతు కోరిన అమరావతి రాజధాని రైతుల ప్రతినిధులు

మహా పాదయాత్ర

    మంగళగిరి, (జనస్వరం) : ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్‌ 1వ తేదీ నుంచి చేపట్టీ మహా పాదయాత్రకు మద్దతు తెలియచేయాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారిని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కోరాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ శ్రీ నాదెండ్ల మనోహర్‌ గారిని కలిశారు. తాము చేపడుతున్న మహాపాదయాత్ర వివరాలను తెలియచేశారు. 45 రోజులపాటు సాగే ఈ మహా పాదయాత్ర తుళ్ళూరు గ్రామం నుంచి తిరుమల వరకూ సాగుతుందని వివరించారు. డిసెంబర్‌ 17వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. దాదాపు రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నామని, అమరావతి పరిరక్షణలో భాగంగా మహా పాదయాత్ర తలపెట్టామన్నారు. ఈ సందర్భంగా రాజధాని కోసం రైతులు, ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని విషయంలో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని శ్రీ నాదెండ్ల మనోహర్‌ గారు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శ్రీ ఎ.శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ తిరుపతిరావు, రాజధాని ఐకాస కార్యదర్శి శ్రీ బెజవాడ రమేష్‌, సభ్యులుశ్రీ కొండేపాటి సతీష్‌ (బుజ్జి), శ్రీ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way