భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ సందర్భంగా వైద్య సిబ్బందిని అభినందించిన రైల్వే కోడూరు జనసేన నాయకులు

వ్యాక్సిన్

             రైల్వే కోడూరు ( జనస్వరం ) : గత రెండు సంవత్సరాలుగా ప్రపంచదేశాలను వణికించి, ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న covid 19 నుండి రక్షణ దిశగా భారతదేశం వందకోట్ల కరోనా వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న సందర్భంగా, అందకు సహకరించిన డాక్టర్స్, నర్స్ లు సంబంధిత సిబ్బంది ఫ్రంట్లైన్ వారియర్ గా నిలిచినందుకు వారికి అభినందనలు తెలుపుతూ రైల్వే కోడూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ చైతన్య, డాక్టర్ మార్టిన్ లూథర్ మరియు డాక్టర్ బ్రహ్మ కుమారిని గౌరవ ప్రదంగా సాళువ, పూలమాలతో ఉత్తరాది శివకుమార్, మర్రి రెడ్డి ప్రసాద్, మహేష్.నగిరిపాటి, అంకీ శెట్టి మనీ మరియు గిరిధర్ గారులచే చిరు సత్కారం చేయబడినది. అనతి కాలంలో ఉచితంగా వందకోట్ల వ్యాక్సిన్ లను వేయించడంలో చొరవ చూపిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way