పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 22వ రోజు సేవా కార్యక్రమాలు

జనసేన NRI సేవా సమితి కువైట్

                 జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 22వ రోజు చంద్రగిరి నియోజకవర్గం,ఎర్రా వారి పాలెం మండలం చింతగుంట గ్రామంలో ఆది ఆంధ్ర హరిజన వాడలో ఉన్న డప్పు కళాకారులకు డప్పులు అందించారు. సిద్దయ్య వారి బృందానికి 10 డప్పులని చింతగుంట గ్రామస్తులు కంచన రాజగోపాల్ రెడ్డి కుమారుడు కంచన శ్రీకాంత్ గారు దాతృత్వముతో అందచేశారు. ఈ డప్పులని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, జిల్లా కార్యదర్శి పోటుకూరి ఆనంద్, జనసేన సీనియర్ నాయకులు చింతకాయల కృష్ణయ్య, జాయింట్ సెక్రటరీ బీగాలా అరుణ, మండల నాయకులు ముండ్లపాటి మురళి, జస్వంత్, నాగేంద్ర,శేఖర్, సాయి,రెడ్డి, గజేంద్ర, సునీల్ మరియు జనసేన నాయకుల సమక్షంలో వారికి అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీతో కలసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకి జనసేన పార్టీ తరపున డప్పులు పంపించిన జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారికి, జనసేన NRI సేవా సమితి కువైట్ వారికి మరియు జనసేన నాయకులకి ధన్యవాదములు తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way