మదనపల్లి, (జనస్వరం) : మదనపల్లె లో చేనేత కార్మికుడు సాపల నారాయణ గారు చేనేత దినోత్సవం రోజు ఆర్థిక కారణముచే ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య లక్ష్మీదేవి మరియు కూతురు భారతి, కొడుకు సుబ్రహ్మణ్యం కలరు. వారికి జనసేన పార్టీ తరపున రాయలసీమ కో-కన్వీనర్ గంగారావు రామదాసుచౌదరి గారు రూ 10000 -00 (పదివేలు రూపాయలు) జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాయము చేసినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున ఇల్లు మరియు 10 లక్షలు ఇవ్వమని బలంగా పోరాటం చేస్తామని మరియు మృతుడు నారాయణ గారికి డబ్బు ఇవ్వవలసింటే ఇవ్వాలని, భాకి దారులు కుటుంబాన్నిబలవంతం చేయవద్దని ఈ సందర్భంగా వేడుకొంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమములో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు దారం అనిత , జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శుడు అడపా సురేంద్ర మరియు జనసేన కార్యకర్తలు తదితురులు పాల్గొన్నారు.
