స్థానిక సమస్యల పరిష్కారానికై జనసేన ఉద్యమబాట : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌

స్థానిక సమస్యల

        గుంటూరు అర్బన్‌, (జనస్వరం)  : గోతులమయంగా మారిన రోడ్లతో, అధ్వాన పారిశుద్యంతో ప్రజలు నరకయాతన పడుతున్నారని, స్థానిక సమస్యల పరిష్కారానికై ప్రజల పక్షాన పోరాడేందుకు జనసేన పోరాటాలకు సిద్దంగా ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌ గారు అన్నారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్‌ అభ్యర్థులతో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావుతో కలసి ఆయన సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా బోన బోయిన శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడములో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తచేశారు. ఈ కార్యక్రమములో  కార్పొరేటర్లు దాసరిలక్ష్మీ, యర్రంశెట్టి పద్మావతి  జనసేన నాయకులు నారదాసు, ప్రసాద్‌, ఆళ్ళహరి, నక్కలవంశ, విజయలక్ష్మీ, రజని, దాసరి వెంకటేశ్వర్లు, కొవ్వుల కిరణ్‌, చేజర్ల శివ కుమార్, మల్లికా, పద్మావతి, వానుశిఖబాలు  తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way