జనసేన నాయకుడి భూమిని ఆక్రమించుకున్న వైసీపీ నాయకులు

     రాజంపేట,  (జనస్వరం) : కడప నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ముడుంపాడు పంచాయితీ జనసేన సర్పంచ్ అభ్యర్థి సంజీవ్ కుమార్ గారి భూమిని వైసీపీ నాయకులు అక్రమించుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు ఘటనాస్థలానికి వెళ్లి సమస్య గురించి తెలుసుకున్నారు. రామ శ్రీనివాసులు అక్కడి వైసీపీ నాయకులతో మాట్లాడి సమస్యను సామరస్యoగా పరిష్కరించారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, జనసేన నాయకులు అండగా ఉంటారని అన్నారు.