జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల వైద్యఖర్చులకు ఒంగోలు జనసేన నాయకుల ఆర్థిక సహాయం

ఒంగోలు

        ఒంగోలు గద్దలగుంటకు చెందిన దండే వినయ్ కుమార్ కుమారులైన లాసీతా, మోక్షిత్లు చిన్నతనం నుండే జన్యుపరమైన స్పైనల్ మస్క్యులర్ ఎంట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నారు. కాళ్ళనుండి నడుము వరకు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉన్న  ఆ చిన్నారులకు వైద్య ఖర్చు కోట్లల్లో అవుతుందన్న వార్త కధనాలకు స్పందించిన  జనసేన పార్టీ  ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్. రియాజ్ ఆధ్వర్యంలో వైద్య ఖర్చులు కోసం 30 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ ఒంగోలులో ఇద్దరు పిల్లలు ఆరోగ్య సమస్య మీద బాధ పడుతున్నారని తెలుసుకుని, పిల్లలకు వైద్య ఖర్చులకు కొంత చేయూత అందించడం జరిగిందని తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ చిన్నారుల సమస్యను తీసుకువెళ్లి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు 450 మంది ఉన్నారు. ఈ ఇంజెక్షన్ భారతదేశంలో కూడ లేదు. ఇతర దేశం అమెరికా నుంచి తీసుకొని రావాలి . ఇలాంటి సమస్యలు ఉన్న పిల్లలకు వైద్య ఖర్చులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపు ఇచ్చి పిల్లల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్ తో పాటు బెల్లంకొండ సాయి బాబా, చిట్టెం ప్రసాద్, అడుసుమల్లి వెంకట్రావు, చీకటి వంశీదీపక్, కొల్లా మధు, రమేష్, కళ్యాణ్ ముత్యాల, మనోజ్, జొన్న వెంకట్ మరియు జనసైనికులు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way