విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జనసైనికుడు కుటుంబానికి జనసేన పార్టీ తరుపున 6 లక్షల ఆర్థిక సాయం

జనసైనికుడు

          కర్నూలు జిల్లా తుగ్గలి మండలం R.S పేండేకల్లు గ్రామానికి చెందినటువంటి జనసైనికుడు అయినా ఇమాంవలి పేండేకల్లు గ్రామంలో పీర్ల చావిడికి పెయింట్ వర్క్ చేస్తుండగా అకస్మాత్తుగా HT 11kv వైర్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలడం జరిగింది. చేయికి భయంకరంగా దెబ్బ తగలడంతో  R. S పేండేకల్లు కర్నూల్ GGH హాస్పిటల్ నందు అడ్మిట్ చేసి  డాక్టర్స్ ఎడమ చేయి మోచేతి వరకు మరియు రెండు కాళ్ళ వేళ్ళు తొలగించడం జరిగింది. ఇమాంవలి వయస్సు 26 సంవత్సారాలు తనకు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల వయస్సు 8 నెలలు ఇమాంవలి రోజు కూలీకి వెళ్తే కానీ పూట గడవదు. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరపున 6 లక్షల రూపాయలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు, మరియు అనంతపురం జిల్లా అధ్యక్షుడు శ్రీ టి. సి వరుణ్ గారు  అలాగే కర్నూలు జిల్లా నాయకులు చింత సురేష్ గారు , రేఖ గౌడ్ గారు, చల్లా వరుణ్ గారు, హర్షత్, పత్తికొండ రాజశేఖర్ గారి, చేతులమీదుగా ఇమాంవలి కుటుంబానికి 6 లక్షల రూపాయల చెక్ ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way