నందలూరులో అల్విన్ స్థానంలో కొత్త ఫ్యాక్టరీ నిర్మిస్తానన్న మాట ఏమైంది జగన్ గారు.. : రాజంపేట జనసైనికులు

నందలూరు

              రాజంపేట నియోజకవర్గము నందలూరు మండలం జనసైనికులు మరియు జనసేనపార్టీ కువైట్ వారి సారథ్యంలో నూతనంగా రాష్ట్ర జనసేన కార్యదర్శులుగా ఎన్నికకాబడిన రాజంపేట జనసేనపార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ ముఖరంచాంద్ గారికి మరియు రైల్వేకోడూరు జనసేన నాయకులు శ్రీ తాతంంశెట్టినాగేంద్ర గారికి బస్టాండ్ నందు మార్గ మధ్యలో ఘనంగా వారిని సత్కరించారు. అలాగే రాజంపేట నియోజకవర్గంకే తలమానికం అయిన నందలూరు అల్విన్ ఫ్యాక్టరీని నందలూరు నిరుద్యోగుల కోరిక మేరకు సందర్శించి ఎన్నికలపుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామి ప్రకారం నిరుద్యోగ యువతకి అల్విన్ స్థానంలో ఇంకొక ఫ్యాక్టరీ ప్రారంభిస్తాము అని చెప్పిన మాటను గుర్తు చేయడం జరిగింది. అలాగే ఈ సమస్య గురించి ప్రభుత్వానికి అతి త్వరలో వినతి పత్రము ఇస్తాం అని అన్నారు. స్పందించని పక్షాన నందలూరు జనసైనికుల ఆధ్వర్యంలో ధర్నా కూడా చేసి నిరుద్యోగ యువతకు అండగా ఉంటాము అని తెలియచేసారు. ఈ కార్యక్రమములో  గురివిగారి వాసు, ఉపేంద్ర, తిప్పాయపల్లి ప్రశాంత్, సిద్దిఖ్, మంకు వెంకటేశ్, బాలు, రామకృష్ణ, మల్లి, మస్తాన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way