ఆనందయ్య మందు పేదలకు అందించాలి : నెల్లూరు జిల్లా జనసేన పార్టీ

                     బొణిగి ఆనందయ్య  గారు తయారుచేసే కరోనా ఆయుర్వేద మందు జిల్లాలోని పేదవారికి అందడం లేదని, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్‌ నాయకుడు పి టోనీ బాబు గారు నగరంలోని బాబాసాహెబ్‌అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టొనీ బాబు మాట్లాడుతూ ఆనందయ్య తయారుచేసే కరోనా ఆయుర్వేద మందు జిల్లాలోని పేదలకు అందేవిధంగా జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో షాన్వాజ్‌, సుబ్బు, చంద్ర, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook