విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ జనసేన కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్య గారు, జనసేన టౌన్ ప్రెసిడెంట్ అద్దేపల్లి గణేష్ గారు 9వ వార్డ్ లో ఈ కరోన విపత్కర పరిస్థితుల్లో ప్రజలు క్షేమంగా ఉండాలని భయాందోళనకి గురి కాకుకూడదని ప్రతిక్షణం వార్డ్లో బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయించారు. అలాగే నిరంతరం శానిటేషన్ చేయించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని, మాస్కులు శానిటైజర్ లు వాడాలని కోరారు. సామాజిక దూరం పాటించాలని తెలియచేస్తూ ఎప్పటికప్పుడు వార్డ్ లో పరిస్థితులు తెలుసుకుంటూ ప్రజల అవసరాలు తీరుస్తున్నారు.
