
విశాఖ పశ్చిమ నియోజకవర్గం 57 వ వార్డులో ఆత్మీయ సమావేశం మోల్లి చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు, కంఠంరెడ్డి శివ శంకర్ గారు, కాళ్ళ నాగ చంద్రామని గారు, కాళ్ళ మని ప్రసాద్ గారు, కనకరాజు గారు జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.