కువైట్ లో పాలకొల్లుకి చెందిన అంబటి వీర్రాజు గారు గత నాలుగు నెలల నుండి తన రెండు కిడ్నీలు చెడిపోయి అనారోగ్యపాలయ్యారు. రోజు మర్చి రోజు డయాలసిస్ చేసుకుంటే గాని బ్రతకలేని పరిస్థితి ప్రతి రెండు రోజులకొకసారి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే చనిపోయే ప్రమాద స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన NRI సేవా సమితి (కువైట్) సభ్యులు మరియు జనసైనికులు తనకి అండగా నిలబడి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే తనని ఇండియాకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. కువైట్ జనసేన నాయకులు నాయకులు మాట్లాడుతూ వృత్తి రీత్యా ఇతర దేశాలలో ఉంటూ కువైట్ జనసైనికులు పార్టీ కోసం ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు , ఈ సహాయాన్ని అన్నారు. దగ్గరుండి అందించిన జనసేన నాయకులు రామచంద్ర నాయక్, అంజన్ కుమార్, కంచన శ్రీకాంత్, మాదాసు నరసింహులు, జగిలి ఓబులేసు, రెడ్డి చెర్ల ఆంజనేయులు, చీర్ల మల్లికార్జున్, అల్లం ప్రేమ్ రాయల్, కొమ్మినేని బాలాజీ రాయల్, బుర్రా శంకర్, ఆకుల సుమన్, గుంటూరు శంకర్, పగడాల చరణ్ తదితరులు పాల్గొన్నారు.
