ప్రమాదంలో గాయాలపాలైన జనసైనికుడు మోహన్ కు రూ. 10,000 ఆర్థిక సహాయం అందించిన మాడుగుల జనసేన నాయకులు

              విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు జనసైనికుడు మోహన్ కి యాక్సిడెంట్ అయి గాయాలపాలు అవ్వడంతో, మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ తరపునుండి 10000/- ఆర్ధిక సహాయం చేయ్యడం జరిగింది. ఈ సహాయాన్ని మోహన్ కుటుంబానికి అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిన జనసేన పార్టీ గుర్తుకు వస్తోంది అని తెలియజేశారు.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముర్రు ఈశ్వర్, బొయిదాపు కిరణ్, గుమ్మడి శ్రీరామ్, జి.వి మూర్తి, సేనాపతి నాగరాజు, కె.గోవిందరావు, బి.పాలవెల్లి, గుల్లిపల్లి రామునాయుడు మరియు జనసేన కార్యకర్తలు హాజరయ్యారు.