జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు గారికి 68 వ వర్థంతి సందర్బంగా ఘనమైన నివాళి

జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు గారికి 68 వ వర్థంతి సందర్బంగా ఘనమైన నివాళి 

             జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలో బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టిశ్రీరాములు గారి 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం ఫలితమే ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావం అని గుర్తుచేశారు. అయనలాంటి పోరాట స్ఫూర్తి మనకు రావాలని ఆకాంక్షించారు. శ్రీరాములు గారి ఆశయాలను జనసేన మరియు బీజేపీ ఇరు పార్టీలు సంయుక్తంగా ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ పాల్గొన్నారు. బీజేపీ నాయకులు యువ మోర్చా ప్రెసిడెంట్ కరుణ్ చంద్ నాయుడు, కృష్ణారెడ్డి అప్పారావు చారి శ్రీను మండల జనసైనికులు వెంకట్, రామారావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.