రామచంద్రపురం ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు
రామచంద్రపురం పట్టణము 2 వ వార్డు స్టీల్ వెల్ పేట మందపల్లి రాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి సమక్షంలో కొంత మంది జనసేన పార్టీ లోకి చేరడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్దాంతాలు నచ్చి మన జనసేన పార్టీ లోకి స్వచ్చందంగా చేరడం పట్ల రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు వీరందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.