కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు

కందుకూరు

        అనంతపురం రూరల్, నవంబర్ 27, జనస్వరం : కందుకూరు గ్రామ పంచాయితీలో మంగళవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను దాని నిర్మాణానికి పాటుపడిన మహోన్నత వ్యక్తులు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క బృందాన్ని స్మరించారు. ప్రభుత్వం అనేది శరీరమైతే రాజ్యాంగం ఆత్మ లాంటిదని ప్రభుత్వాలకు దిశా నిర్దేశాలు చూపించేది రాజ్యాంగం అని వివరించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఒక సంక్లిష్టమైన రాజ్యాంగం అని దీన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేశారని తెలియపరిచారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదింపబడి, 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన తర్వాత భారత అభివృద్ధికి ఒక దిశ, బాట, ప్రణాళిక ఏర్పడిందని తెలిపారు. భారత రాజ్యాంగ రచనకు 35 నెలలు, 18 రోజులు పట్టిందని, ఈ రాజ్యాంగం ఫలితంగా ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ హక్కు లభించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way