Search
Close this search box.
Search
Close this search box.

ఉమ్మడి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్

       సరుబుజ్జిలి, మార్చి 18 (జనస్వరం) : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సరుబుజ్జిలి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ మరియు మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్ ని గెలిపించేందుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం కొరకు ఇరు పార్టీల ముఖ్య నాయకులతో మండల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నికలే లక్ష్యంగా కృషి చేస్తున్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూటమి విజయం అనంతరం సముచిత స్థానం కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పనిచేయకుండా పదవులు ఆశించకూడదని పార్టీ శ్రేణులకు గుర్తు చేశారు. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ పొత్తు ధర్మం పాటించాలని, పొత్తును వ్యతిరేకించే వైసిపి నాయకుల చర్యలను తిప్పి కొట్టాలని వ్యాఖ్యనించారు. అలాగే ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way