మాధవమ్మ ఆధ్వర్యంలో భారీగా జనసేన పార్టీలో చేరికలు

   నెల్లిమర్ల ( జనస్వరం ) :  నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం , ముంజేరు పంచాయితీలో అవినీతి, అరాచక పాలన చేస్తూ, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సహజ వనరులను దోచుకు తింటూ, 2019 వైసిపి పార్టీ గెలుపు కోసం కష్టపడిన నేతలను, కార్యకర్తల సేవలను విస్మరించారు. అడ్డగోలుగా వ్యవహరిస్తూ, అసమర్ధ పాలన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు వ్యవహార శైలికు విసుగు చెందారు. జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన రాజకీయ ప్రయాణం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపన అదే సమయంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో  లోకం మాధవి గారు అనునిత్యం చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్న తీరు, చేస్తున్న దానధర్మాలు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన నిలబడుతున్న తీరు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయన సమర్థమైన నాయకత్వానికి ఆకర్షితులైన్నారు. శ్రీమతి లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ముంజేరు గ్రామ వైసీపీకి చెందిన 150 కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ లోకం మాధవి గారు గారు జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way