విలేకరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్

       చిత్తూరు ( జనస్వరం ) : అనంతపురం జిల్లా రాప్తాడులో జర్నలిస్టుపై వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణమని, ఈ దాడి వైసీపీ నిరంకుశ పాలనకు అద్దం పడుతుందని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్థంభం లాంటి వారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు పత్రికా విలేకరులపై దాడి చెయ్యడం హేయమైన చర్య అని ఆరోపించారు. జర్నలిస్టులపై దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండడం సిగ్గుచేటన్నారు. ఎక్కడో అనంతపురం జిల్లాలో నిర్వహించే కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా పరిసర ప్రాంత ప్రజలు, వృద్ధులు, బాలింతలు రవాణా సౌకర్యం లేక తల్లడిల్లిపోయారని తెలిపారు. ప్రజా ధనాన్ని స్వార్థం కోసం వాడుకోవడం దారుణమన్నారు. ఇది ప్రజాస్వామ్యమా, వైసీపీ రౌడీ రాజ్యమా అని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ రాక్షసపాలన నుంచి జనసేన, టీటీడీ సంయుక్తంగా ప్రజలకు విముక్తి కలిగిస్తుంది భరోసా కల్పించారు. దేశ చరిత్రలో ఎన్నడూ సీఎం సభలో జర్నలిస్టులపై దాడి సంఘటన జరగలేదని తెలిపారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన విలేకరిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడ్డ వైసీపీ గూండాలను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాళరాస్తూ వైసీపీ అరాచకాలకు పాల్పడ్డ నిందితులను గుర్తించి నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way