రోడ్లు, డ్రైనేజ్ కాలువలను పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చెయ్యాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

రోడ్లు, డ్రైనేజ్ కాలువలను పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చెయ్యాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ

                    జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం కంభంపాడు గ్రామం శివాలయం వెనుక బజార్ గల బీసీ కాలనీ లో గల మట్టి రోడ్లు ను మరియు డ్రైనేజ్ కాలువలను జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ బృందం సందర్శించారు. రోడ్లను మరియు డ్రైనేజ్ వ్యవస్థను త్వరితిగతిన నిర్మించాలని స్థానిక అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ కంభంపాడులోని బీసీ కాలనీ రోడ్లు గుంతలతో కూరుకుపోయి ఉండటంతో వర్షాలు కురిసినప్పుడు గుంతలతో కూరుకుపోయిన రోడ్ల మీద ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో బీసీ కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో ప్రజలు వాడుకుంటున్న నీరు కూడా ఎటు వెళ్లాలో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. కావున దయచేసి బీసీ కాలనీకి త్వరతిగతిన రోడ్లు సదుపాయం కల్పించాలని మరియు డ్రైనేజ్ కాలువలను పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చుడాలని బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way