Search
Close this search box.
Search
Close this search box.

తాగటానికి గుక్కెడు రక్షిత మంచినీరు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ పాలన

     గుంటూరు ( జనస్వరం ) : వైసీపీ నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో సైతం అగ్రహజ్వాలాలు పెల్లుబికుతున్నాయని, వైసీపీ ప్రజా కంఠక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే అందరి లక్ష్యం కావాలని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 55 డివిజన్ అధ్యక్షుడు కొనిదేటి కిషోర్ ఆధ్వర్యంలో డొంకరోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజలతో ముఖాముఖి అయ్యారు. స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు ముస్తఫాకి పదేళ్లు శాసనసభ్యుడిగా అధికారం ఇచ్చినా కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేకపోయాడని విమర్శించారు. కనీసం ప్రజలకి తాగేందుకు రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. డయేరియాతో ఇప్పటివరకు ముగ్గురు మృత్యువాత పడితే ముస్తఫా ఎక్కడ దాక్కున్నాడని మండిపడ్డారు. రకరకాల డ్రామాలాడుతూ నటనలో కమల్ హాసన్ ని మించిపోయాడని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అతి సమీపంలోనే ఉన్నాయని ప్రజలెవరూ కూడా ఏమరుపాటుగా ఉండొద్దన్నారు. మూడు నెలల్లో రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులు రానున్నాయని. మంచి పాలకులను ఎన్నుకోవాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ల హరి,  జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way