Search
Close this search box.
Search
Close this search box.

సర్వేపల్లి అభివృద్ధికి రాబోయే ప్రజా ప్రభుత్వంలో టీడీపీతో కలిసి జనసేన పార్టీ కృషి

   సర్వేపల్లి ( జనస్వరం ) : తోటపల్లిగూడురు మండలంలోని తోటపల్లి బిట్టు – 2 నందు శుక్రవారం పర్యటించి స్థానిక సమస్యలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ నందు మోటార్ చెడిపోయి ఉందన్నారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే పంచాయతీ అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కనీసం ఈ స్థితిలో కూడా రాక్షస ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రజలను ఇంకెవరు పట్టించుకుంటారు. ఇటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి, ఇటువంటి మంత్రి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరమా అని అన్నారు. ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందులు వీళ్ళకి పట్టవా. తాగడానికి నీళ్లు కూడా అందించాలని స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రజల గురించి ప్రజల అవస్థల గురించి ఇంకేం పట్టించుకుంటారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలో కూడా ఎక్కడా కూడా పంచాయతీలలో కాలువలలో బ్లీచింగ్ కొట్టించిన పరిస్థితి లేదు. పంచాయతీలలో నిధులు ఉన్నాయా లేవా తోటపల్లి బిట్ వన్ నందు వారం లోపల వాళ్లకి మినరల్ వాటర్ మోటార్ను రిపేరు చేసి వెంటనే తాగునీరు అందించాలి అలా ఇవ్వని పక్షంలో మేమే ఆ మోటర్ నీ రిపేర్ మా సొంత నిధులతో చేయించి వాళ్లకి తాగునీరు అందిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో రానున్న ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకు అండగా నిలబడి గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవాని, మండల అధ్యక్షుడు సందీప్, కోర్ కమిటీ కార్యదర్శి కల్తి రెడ్డి శ్రీనివాసులు, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి, స్థానిక నాయకులు బద్వేల్ చందు, రాయప్ప, వన్ బద్వేల్ చరణ్, రవి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way