మాదిగ మహా సమ్మేళనంలో గర్జించిన దంపెట్ల శివ

   అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం అంబేద్కర్ భవన్ లో జరిగిన మాదిగల మహాసమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది వరకే శిక్షణ ఇచ్చిన డప్పు కళాకారులతో దాదాపు 30 మందితో సమ్మేళనం నందు డప్పు ప్రదర్శన చేయించడం జరిగింది. ఆ తరువాత డప్పు మాస్టర్ ను సన్మానించి మాస్టర్ కి 10000 రూపాయలు చెక్ ను ట్రస్ట్ చైర్మన్ శివ అందజేశారు. దంపెట్ల శివ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అక్షరాల్లో తప్ప… మనల్ని ఈ ప్రభుత్వాలు కేవలం ఒక ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయని అన్నారు.  మనకు ఇవ్వాల్సిన, పొందాలసిన గౌరవాన్ని ఇవ్వట్లేదు. మన పిల్లలకు రాజ్యాంగం ద్వారా కల్పించాల్సిన విదేశీ విద్యలు, నాణ్యతమైన విద్యలు ఎక్కడ ? మనం కేవలం మాదిగ మహా సమ్మేళనం అంటూ సభలు పెట్టుకొని ఇంతటితో మాట్లాడటం, చర్చించడం కాదు…. మనకంటూ, మన జాతి భవిష్యత్తు కోసం శ్రమిద్దామన్నారు. 140 కోట్ల మందికి ఒక్క అంబేద్కర్ పుడితే, మన హక్కుల కోసం, మన రాజ్యం కోసం మన జాతి అంతా కలసి ఒక అంబేద్కర్ కాలేమా అని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way