శ్రీకాళహస్తి వైసీపీ నుండి జనసేనలో చేరికలు

   శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఉన్నత విద్యావంతులు RCR కాలేజి ప్రిన్సిపాల్, శ్రీకాళహస్తికి చెందిన Dr. N.G.A ప్రసాద్ వారి మద్దతు దార్లతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ప్రసాద్ గారికి నియోజకవర్గ ఇంఛార్జి  వినుత కోటా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో ప్రసాద్ వైసీపీ పార్టీ గెలుపుకోసం చాలా క్రియాశీలకంగా పని చేసి, వారి కాలేజిలో చదువుకున్న వేల మంది స్టూడెంట్స్ సైతం శ్రీకాళహస్తి లో వైసీపీ గెలుపుకి పని చేశారు. ఈ 5 సం. పాలనలో ప్రజలు కోరుకున్న ఎలాంటి మార్పు జరగకపోవడంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే యువత ఆశించే మార్పు సాధ్యం అని నమ్మి ఈరోజు పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో తనకి విశేషంగా పరిచయాలు ఉన్న వేల మంది విద్యార్థులను సైతం శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ గెలుపు కొరకు కృషి చేసేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఇంఛార్జి తోట గణేష్, మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్రశేఖర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way